Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్‌కు సవాల్ విసిరిన చింతమనేని : దమ్ముంటే ఆ పని చేయించు...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (10:26 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ బహిరంగ సవాల్ విసిరారు. ఇటీవల ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో పాటు వాహనాల కొనుగోలు అంశంపై పార్టీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. తెదేపా నేతల అరెస్టును ఖండిస్తూ చింతమనేని ప్రభాకర్ ఆందోళన చేశారు. దీంతో ఆయన్ను కూడా కూడా పోలీసుల్ అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనతో పాటు.. ఆయన అనుచరులను బెయిలుపై విడుదల చేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు చింతమనేని సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తన కేసును సీబీఐకి అప్పగించాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కానీ, తెదేపా నేతలకు కష్టాలు సృష్టించడమే జగన్ ఏకైక లక్ష్యంగా ఉందన్నారు. ఇదే అంశంపై తాను హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments