Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్యేను స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీసులు.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (13:24 IST)
గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయని, అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైకాపా నేతలు, శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇందులోభాగంగా, ఎమ్మెల్యే డోలా ఇంటిని ముట్టడించారు. దీంతో డోలా ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలోని నాయుడుపాలెంలో ఎమ్మెల్యే నివాసం ఉండగా, అక్కడ వైకాపా నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొండపి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ వరికూటి అశోక్ బాబు నేతృత్వంలోని ఎమ్మెల్యే ఇంటి ముట్టిడికి వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు, నేతలు టంగుటూరులోని వైకాపా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైకాపా తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వరికూటి అశోక్బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే డోలాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments