Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం పనుల్లో చంద్రబాబుకు ముడుపులు అందాయ్ : జైరాం రమేష్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం పనుల్లో చంద్రబాబు నాయుడుకి ముడుపులు అందాయని ఆరోపించారు.

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (14:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం పనుల్లో చంద్రబాబు నాయుడుకి ముడుపులు అందాయని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఆయన ముడుపులు తీసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
 
విభజన హామీలకు సంబంధించి ప్రధాని మోడీ, చంద్రబాబు ఇద్దరూ డ్రామాలాడుతున్నారని అన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమయిందని వ్యాఖ్యానించారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరగలేదని బీజేపీ అంటోందని... అదే నిజమైతే పార్లమెంటులో మెజార్టీ కలిగిన బీజేపీ చట్టంలో మార్పు చేయవచ్చు కదా?, అలా చేస్తే తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని జైరాం రమేష్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments