Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి జోరు, వైసిపి బేజారు..?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:26 IST)
తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంటోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రభుత్వంపై కాస్తంత వ్యతిరేకత వుందనీ, ప్రజా పోరాటాలతో ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అదే ఆయుధంగా ముందుకు సాగుతున్నారట. దీంతో ప్రజలకు దగ్గరవుతున్నారన్న సంకేతాలు ఉన్నాయట. 

 
తాజాగా వైసిపి నుంచి టిడిపిలో చేరికలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతోను, అలాగే ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుండటంతోనే ఆ పార్టీపై నమ్మకంతో చేరికలు పెరిగిపోతున్నాయట.

 
ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా పలుచోట్ల ఫలితాలు వచ్చాయి. దీంతో పార్టీ పుంజుకున్నట్లు పరిస్థితి కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా చాలా చోట్ల ఎంపిటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలకు సంబంధించి టిడిపి కొన్నిస్థానాలను కైవసం చేసుకోవడం.. అలాగే పలు ప్రాంతాల్లో గట్టి పోటీ ఇవ్వడం కూడా జరిగాయట.
 
రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలైన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌదారగిన్నె గ్రామానికి చెందిన 150 వైసిపి కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్థన్ రెడ్డి టిడిపిలో చేరడం.. అలాగే అనంతపురం జిల్లాలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 100 మంది వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరడం లాంటివి జరిగాయి.
 
అంతేకాకుండా పశ్చిమగోదావరి, పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లాల్లోను ఇదేవిధంగా చాలామంది వైసిపి నుంచి టిడిపిలో చేరడంతో పార్టీపై నమ్మకంతో ఇదంతా జరుగుతోందని.. ఇలాగే పోరాటం చేస్తే టిడిపిపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments