Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారంపూడి అవినీతిపై విచారణకు ఆదేశించాలి : టీడీపీ నేత వర్మ డిమాండ్

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (08:49 IST)
వైకాపాకు చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్పడిన అవినీతిపై తక్షణం విచారణకు ఆదేశించాలని కోరుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయించారని, కోట్లాది రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 
 
కాకినాడ నగర ప్రజల ఇళ్ళ పట్టాల కోసం కొత్తపల్లి మండలం కొమరిగిరిలో 350 ఎకరాల భూమిని సేకరించారని, ఈ భూమిని చదును చేయడటం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్టు రికార్డు పత్రాల్లో చూపించి అవినీతికి పాల్పడ్డారని వర్మ ఆరోపించారు. 
 
13 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి తన బినామీలకు మాత్రమే ఇళ్ల పట్టాలను ఇచ్చారని, ఆ తర్వాత ఆ స్థలాలను అక్రమంగా విక్రయించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కొత్తపల్లి మండలి మత్స్యకారులకు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments