Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారంపూడి అవినీతిపై విచారణకు ఆదేశించాలి : టీడీపీ నేత వర్మ డిమాండ్

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (08:49 IST)
వైకాపాకు చెందిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్పడిన అవినీతిపై తక్షణం విచారణకు ఆదేశించాలని కోరుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన పిఠాపురంలో టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాలను అక్రమంగా విక్రయించారని, కోట్లాది రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 
 
కాకినాడ నగర ప్రజల ఇళ్ళ పట్టాల కోసం కొత్తపల్లి మండలం కొమరిగిరిలో 350 ఎకరాల భూమిని సేకరించారని, ఈ భూమిని చదును చేయడటం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసినట్టు రికార్డు పత్రాల్లో చూపించి అవినీతికి పాల్పడ్డారని వర్మ ఆరోపించారు. 
 
13 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి తన బినామీలకు మాత్రమే ఇళ్ల పట్టాలను ఇచ్చారని, ఆ తర్వాత ఆ స్థలాలను అక్రమంగా విక్రయించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కొత్తపల్లి మండలి మత్స్యకారులకు, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments