Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు తగిన స్థలం చూపిస్తాం : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (16:33 IST)
వచ్చే ఎన్నికల తర్వాత వైకాపా నేతలకు తగిన స్థలం చూపిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నాయకులకు ఒక్కటే చెబుతున్నా.. మీరు తీవ్ర అసహనంలో ఉన్నారు. మీరు తిడతారని కూడా తెలుసు. మీరు ఓడిపోతున్నారనే విషయం మీకు కూడా తెలుసు. మీ ఎక్స్‌పైరీ డేట్ సమీపించింది. అందుకేనేమో... ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరిపడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లేదు. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. 
 
కేసులు పెడితే భయపడిపోతాననో, రౌడీయిజం చేస్తే భయపడతాననో, ఓట్లను తారుమారు చేయొచ్చనో అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. దొంగ ఓట్లను చేర్చేవారికి చెబుతున్నా... ఖబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. అన్నీ కంట్రోల్ చేస్తాం అని అన్నారు. నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం. ప్రజల్లో చైతన్యం రావాల్సివుంది. ప్రజల్లో చైతన్యం కోసం భావితరాల వారి భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments