Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామవలంటీర్లు ప్రజల కోసమా? పార్టీ కోసమా?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు విమర్శలు గుప్పించారు. గ్రామ వలంటీర్లు నియమించుకున్నది ప్రజల కోసమా? పార్టీ కోసమా? అంటూ నిలదీశారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికే అని చెప్పి వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రజాధనంతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు కరోనా సాయం కింద ఇచ్చే 1000 రూపాయలను వైసీపీ నేతలు ఇస్తాననడం ఏంటి? కాదన్న వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఏంటి? వాళ్ళున్నది ప్రజల కోసమా? పార్టీకోసమా? 
 
విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైసీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారు. ఝాన్సీ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఏమిటీ వేధింపులు? ప్రజల డబ్బుతో వాలంటీర్లను పెట్టుకుంది వైసీపీ నేతలకు వంగివంగి దండాలు పెట్టడానికా?" అంటూ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments