Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? చంద్రబాబు ఫైర్

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (14:58 IST)
టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... 'రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించారు.
 
తమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. కశ్మీర్‌, బిహార్‌లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు.
 
వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతున్నా ఆయనకు చీమకుట్టినట్లయినాలేదు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గౌతమ్‌ సవాంగ్‌కు ఏపీ మాజీ చంద్రబాబు లేఖ 
పీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఏపీ మాజీ చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేయాలని, కొందరు పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కొందరు పోలీసుల తీరుతో ఓటర్లు నమ్మకం కోల్పోతున్నారని, నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లు పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఇచ్చే ప్రతి ఫిర్యాదు పట్ల పోలీసులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments