Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తిరుమలేశుని దయతో బ్రతుకుతున్నా, అందుకే 3 కోట్లతో శంకుచక్రాలు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:05 IST)
ఓం నమో వేంకటేశాయ. ఆ తిరుమల వేంకటేశుని దివ్యమంగళరూపం ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరనది. భక్తుల పాలిట కల్పతరువై ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ శక్తికొలది కానుకలు సమర్పించుకుంటూ వుంటారు. బుధవారం తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు భారీ కానుక సమర్పించాడు. శ్రీవారికి శంకుచక్రాలను చేయించి సమర్పించాడు.
 
వీటి విలువ సుమారు రూ .2 కోట్లు వుంటుందని అంచనా. 3.5 కిలోల బంగారంతో స్వామి కోసం శంకు, చక్రాలను తయారు చేసినట్లు తంగదొరై వెల్లడించారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఆభరణాలను సమర్పించారు.
తంగదొరై గతంలో కూడా శ్రీవారికి బంగారు, వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చారు. వాటిలో బంగారు వడ్డాణం, బంగారు చేతులు, హారము ఉన్నాయి. తిరుమల బాలాజీకి ఎప్పుడూ చాలా విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తూనే వుంటారు.
 
భక్తులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాలు, భూములను అర్పిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు నగదు రూపంలో భారీ కానుకలు ఇచ్చారు. ఆ విధంగా భక్తులు వివిధ రూపాల్లో వెంకటేశ్వరస్వామికి కానుకలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments