Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి... సూసైడ్ చేసుకున్న దంపతులు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (16:20 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఓ దంపతులు కిరాతక చర్యకు పాల్పడ్డారు. తమ రెండున్నరేళ్ళ కుమార్తె చేతి నరాలను బ్లేడుతో కోసి ఆ పై తాము కూడా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
కడలూరు జిల్లా దిట్టకుడి సమీపంలోని ఇడైసెరువాయ్‌ కాలనీకి చెందిన మరుదముత్తు (30), ఉషా దంపతులకు రెండున్నరేళ్ల ప్రత్యుష అనే కుమార్తె ఉంది. ఉపాధి నిమిత్తం మరుదముత్తు కుటుంబం రాజ్‌కోట్‌లో నివశిస్తోంది. ఈ క్రమంలో, కొన్ని నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. 
 
ఈ క్రమంలో ఉదయం ఎంతసేపటికీ వీరు బయటకు రాకపోవడంతో అనుమానించిన బంధువులు కిటికీలో నుంచి లోపలికి చూడగా, మరుద ముత్తు ఉరేసుకొని, అతని పక్కనే ఉషా, కుమార్తె అచేతంగా పడివుండటం గుర్తించి దిగ్భ్రాంతిగురై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా కూతురి చేతిని బ్లేడుతో కోసి హత్యచేసిన అనంతరం భార్యాభర్తలిరువురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటాన్ని గమనించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, వీరి ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments