Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ పీఎంవి తెలిసీ తెలియని మాటలు.. స్వరూపానందేంద్ర స్వామి ఫైర్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:28 IST)
Swami Swaroopanandendra
భార‌త భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు త‌మ‌వేనంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ గతంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కోట్లాది మంది భారతీయులు కొలిచే శ్రీ రాముడు ఓ నేపాలీ అని, ఆయన సతీమణి సీత కూడా తమ దేశ అమ్మాయేనని నేపాల్ ప్రధాని శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా శ్రీరాముడు జన్మస్థానంగా చెప్పుకునే అయోధ్య... తమ దేశంలోనే ఉందన్నారు. 
 
అయితే శ్రీరాముని జ‌న్మ‌భూమిపై నేపాల్ ప్ర‌ధాని ఓలీ చేసిన వ్యాఖ్య‌ల‌ను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. శ్రీరాముని జ‌న్మ‌స్థ‌లం గురించి తెలిసీ తెలియ‌ని మాట‌లు స‌రికాద‌ని పేర్కొన్నారు. 
 
రాముడు భార‌త‌దేశంలో జ‌న్మించాడ‌నేందుకు ఎన్నో చారిత్ర‌క సాక్ష్యాలున్నాయ‌ని వాటిని వ‌క్రీక‌రించ‌డం స‌బబు కాదని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. చైనా ప్ర‌ధాని కుట్ర‌ల‌కు అనుగుణంగా నేపాల్ ప్ర‌ధాని న‌డుచుకోవ‌డం దారుణ‌మన్నారు. 
 
ఇక‌నైనా నేపాల్ త‌ప్పుడు ప్ర‌చారాన్ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. భార‌త్‌లో జ‌న్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమ‌న్నారు. ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితాన్ని స‌మాజానికి అందించిన దివ్య‌మూర్తి శ్రీరాముడ‌ని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments