Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడి చేసి చంపేశారు.. వైఎస్ వివేకా మృతిపై వైఎస్ అవినాశ్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (13:00 IST)
తన పెద్దనాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆకస్మిక మృతిపై వైఎస్. అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పెదనాన్నపై ఎవరో దాడి చేసి చంపేశారని ఆరోపించారు. అందువల్ల ఈ దాడిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన పోలీసులను కోరారు. 
 
శుక్రవారం తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి తమ ఇంట్లోని బాత్రూమ్‌లో రక్తపుమడుగులో పడివున్న విషయం తెల్సిందే. పైగా, ఆయన తలపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణం తమల్ని తీవ్రంగా కలచి వేసిందన్న అవినాష్... పెదనాన్న తలపై రెండు గాయాలు ఉన్నాయని గుర్తు చేశారు. బాత్ రూములో కాలుజారిపడితే తలకు వెనుకవైపు లేదా ముందు వైపు మాత్రమే గాయం అవుతుందని, రెండు వైపులా గాయం అయ్యే పరిస్థితే ఉండదన్నారు. అవి పెద్ద గాయాలని, చేతిపైనా, ముఖంపైనా గాయాలున్నాయని ఆయన అన్నారు. 
 
ఎవరో దాడి చేస్తేనే మరణించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని, తమకున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనని అవినాష్ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ వివేకా మృతిపై తక్షణం లోతైన దర్యాఫ్తును ప్రారంభించాలని కోరారు. కుట్రలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments