Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంలో చుక్కెదురు.. ఏపీ సర్కారుకు నోటీసు!

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (16:22 IST)
తన వ్యక్తిగత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో ఏపీకి చెందిన అధికార వైకాపా ఎమ్మెల్యే అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రాజమండ్రి కోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులు అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది సోమవారం విచారణకు వచ్చింది. 
 
ఆ తర్వాత అనంతబాబు బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. 
 
ఇదిలావుంటే, ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను ప్రభుత్వానికి, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments