Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతిపై సుప్రీం కోర్టులో విచారణ

amaravati
, శుక్రవారం, 4 నవంబరు 2022 (12:50 IST)
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై జరిగే విచారణలో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతుల జేఏసీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
 
అంతేకాకుండా పలువురు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంలో ఇంప్లీడ్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటన్నింటిపైనా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 1ననే ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. 
 
అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్... 'నాట్ బిఫోర్ మీ' అంశాన్ని లేవనెత్తి ఈ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాను సభ్యుడిగా లేని మరో బెంచ్ కు ఈ పిటిషన్ల విచారణను అప్పగించాలని ఆయన కోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పరిశ్రమలకు పెద్దపీట.. ఏపీ సీఎం జగన్