Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ మాజీ ఎంపీ కుమారుడి ఆత్మహత్యాయత్నం!

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (07:53 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనయిర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గత రాత్రి రాంజీ నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగావుంది. 
 
ఈ తెల్లవారుజామున రాంజీని చూసిన కుటుంబీకులు, అతన్ని హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. 
 
రాంజీ పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని గంటలు గడిస్తేనే అతని స్థితిపై ఓ అవగాహన వస్తుందని డాక్టర్లు అంటున్నారు. రాంజీ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరింత సమాచారం తెలియాల్సి వుంది.
 
కాగా, గతంలో రాంజీపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వరసకు వదిన అయ్యే మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లను పంపించాడన్న కేసు విషయంలో విచారణ కొనసాగుతోంది. తనకు జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి కావాలని కూడా రాంజీ గతంలో రోడ్డెక్కారన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments