Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఎక్స్ 100' ప్రభావం.. పెట్రోల్ ఒకరిపై ఒకరు పోసుకుని నిప్పంటించుకున్నారుయ...

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి మిస్టరీ వీడింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వీరిద్దరు మరో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం సాగించారు.

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2018 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మృతి మిస్టరీ వీడింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వీరిద్దరు మరో ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం సాగించారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి మందలించారు. ప్రేమమత్తులో ఉన్న ఆ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసే బంక్‌కు వెళ్లి పెట్రోల్‌ కొనుగోలు చేసుకుని వచ్చారు.
 
మద్యం సేవించిన మత్తులో ఒకరి‌పై ఒకరు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు ఓ సినిమాలోని సన్నివేశాలు ప్రభావితం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి ఆత్మహత్యలు పూర్తిగా ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. 
 
ఇదే అంశంపై పోలీసులు స్పందిస్తూ... పట్టణానికి చెందిన మహేందర్‌, రవితేజలు ఇటీవల వచ్చిన ఓ సినిమాలో ఉన్న సన్నివేశాలకు ప్రభావితమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇద్దరు కలిసే పెట్రోల్‌ కొనుగోలు చేసుకుని మిషన్‌ కాంపౌండ్‌లోకి వెళ్లి మద్యం సేవించి ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
 
గతంలో కొంత మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నవారిలో రవితేజ కూడా ఉన్నాడని అన్నారు. ప్రస్తుతం 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వీరి స్నేహితులతో పాటు మరికొంత మందిని విచారించామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments