Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీబార్ చేశారన్న కోపంతో ప్రిన్సిపాల్‌పై బ్లేడుతో విద్యార్థి దాడి..

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (08:52 IST)
ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. బ్లేడుతో కాలేజీ ప్రిన్సిపాల్‌‍పై దాడి చేశాడు. పరీక్షల్లో కాపీ కొట్టినందుకు తనను డీబార్ చేశారన్న కోపంతో ఆ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిద్దలూరు పట్టణంలోని చిన్నమసీదు ప్రాంతంలో ఉండే గొంట్ల గణేశ్‌ స్థానిక సాహితీ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గత యేడాది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల సందర్బంగా అతడు కాపీ కొడుతూ దొరికిపోవడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ డీబార్ చేసింది. నాటి నుంచి అతడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మూల కొండారెడ్డిపై కక్షతో రగిలిగిపోయాడు. 
 
స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద గురువారం రాత్రి కొండారెడ్డిపై గణేశ్ అకస్మాత్తుగా దాడికి దిగాడు. బ్లేడుతో అతడు కొండారెడ్డి గొంత కోయబోతుంటే ఆయన చేయి అడ్డుపెట్టి తప్పించుకున్నారు. ఈ క్రమంలో చేతికి, గొంతు వద్ద చిన్నపాటి గాయమైంది. దీన్ని గుర్తించిన స్థానికులు కొండారెడ్డిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments