Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని మందలించిన ఉపాధ్యాయుడు.. కాపుకాసి కత్తితో పొడిచిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (09:08 IST)
తనను మందలిస్తున్న ఉపాధ్యాయుడిపై పగతో రగిలిపోయిన ఓ విద్యార్థి అర్ధరాత్రి వేళ కాపుకాసి మరీ కత్తితో దాడిచేశాడు. గాయపడిన ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జరిగిందీ ఘటన. నలుగురిలో తరచూ మందలిస్తుండడంతో ఉపాధ్యాయుడు వీర వెంకటసత్యనారాయణపై విన్సెంట్‌ అనే విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురుచూశాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక కత్తితో ఆయనపై దాడిచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, టీచర్ తనను రోజూ అందరి ముందు అవమానిస్తుండడంతో తట్టుకోలేకే దాడికి పాల్పడినట్టు నిందితుడు విన్సెంట్ అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments