Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు గోదావరిలో పశువులను తింటున్న వింత జంతువు

Webdunia
సోమవారం, 25 మే 2020 (15:39 IST)
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరులో వింత జంతువు సంచారం కలకలం రేపుతుంది. రోజు రాత్రి సమయంలో పొలాల్లో ఉన్న పశువులను చంపేస్తుంది. 
ఇప్పటివరకు 20కి పైగా పశువులు మృతి చెందడంతో నిద్రహారాలు మాని రైతులు 
రాత్రి అంతా పొలాల్లోనే గడుపుతున్నారు.
 
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం పరిధిలో వింత జంతువు సంచారం కలకలం రేపుతుంది. రోజూ రాత్రి వేళల్లో  లేగదూడల్ని చంపేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పశువులను పొట్టన పెట్టుకుంది. దీనితో పాడి రైతుల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వింత జంతువుని ఎవరూ చూడలేదు. పాడి పశువులు, లేగదూడలను చంపి తిని వేయడంతో, ఇది చిరుతా లేక ఇతర జంతువులా అన్న అనుమానం ఉంది.
 
మూకుమ్మడిగా నక్కలు దాడి చేసి ఉండవచ్చనే అనుమానం కలుగుతుంది. పెనికేరు, నవాబుపేట, జొన్నాడ ఈ ప్రాంతాల మధ్యలోనే రాత్రి వేళల్లో సంచరిస్తుంది. ఇటీవల పెనికేరు గ్రామానికి చెందిన కోన శేషయ్య, కోటిపల్లి వెంకన్న, సిరిపాదం వెంకటరమణకు చెందిన లేగదూడలను చంపేసింది. అలాగే జొన్నాడ గ్రామానికి చెందిన రైతు దూడను గాయపరచి దూడ తోకను తినేసింది.
 
ఇలా లేగదూడలను చంపేస్తున్న జంతువు ఏమిటన్నది ఇంతవరకు అంతుచిక్కలేదు. కొందరు చిరుత అని మరికొందరు వింత జంతువని, ఇంకొందరు నక్కల గుంపు అని చెబుతున్నారు. దీంతో రైతులంతా రాత్రి సమయంలో కంటమీద కునుకు లేకుండా మకాంల వద్ద కాపలా కాస్తున్నరు పాడి రైతులు. దీనితో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
వింత జంతువును పట్టుకుని పశువులను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ జంతువు బారిన పడి అనేక లేగదూడలు బలవుతున్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పెనికేరు, నవాబుపేట, జొన్నాడ గ్రామాల పాడి రైతులు కోరుతున్నారు. ప్రతిరోజు లేగదూడలను చంపేస్తున్న సంఘటనలు వెనుక దాగివున్న రహస్యాన్ని పరిష్కరించాలని, మృతి చెందిన లేగదూడల యజమానులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments