Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించండి: సీఎం జగన్

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (17:16 IST)
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోని సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయన్న సంగతి ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలని తెలిపారు.
 
ఈ రోజు ఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను జగన్ పరిశీలించారు. ఆ సందర్భంగా సెప్టెంబరు 5 నుండి పాఠశాలలు ప్రారంభించాలని ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని జగన్ చెప్పారు.
 
ప్రతి స్కూల్లో పెయింటింగ్స్ బొమ్మలు వేయాలని ఆదేశించారు. విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాలలు ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభానికి అన్ని చర్యలను చేపడుతున్నామని తెలిపారు. కాగా రోజూ 9 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న సందర్భంలో నెలరోజుల్లో ఈ సంఖ్య కిందికి వస్తుందా అనే సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments