కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:59 IST)
కాకినాడలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ (కుడా) ప్రమాణ స్వీకారోత్సవంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వేదికపై కూర్చొన్న కూటమి నేతలంతా కిందపడిపోయారు. వీరిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. 
 
కుడా చైర్మన్‌గా తుమ్మల బాబును ప్రభుత్వం నియమించింది. దీంతో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప, జనసేన పార్టీ నేతలు పంతం నానాజీ, హరిప్రసాద్‌ తదితరులు ఆశీనులయ్యారు. 
 
అయితే, వేదికపైకి ఎక్కువ మంది రావండతో వేదిక ఒక్కసారిగా కుప్పుకూలింది. యనమల తదితరులు కిందపడిపోయారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవండతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments