Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:59 IST)
కాకినాడలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ (కుడా) ప్రమాణ స్వీకారోత్సవంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వేదికపై కూర్చొన్న కూటమి నేతలంతా కిందపడిపోయారు. వీరిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. 
 
కుడా చైర్మన్‌గా తుమ్మల బాబును ప్రభుత్వం నియమించింది. దీంతో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప, జనసేన పార్టీ నేతలు పంతం నానాజీ, హరిప్రసాద్‌ తదితరులు ఆశీనులయ్యారు. 
 
అయితే, వేదికపైకి ఎక్కువ మంది రావండతో వేదిక ఒక్కసారిగా కుప్పుకూలింది. యనమల తదితరులు కిందపడిపోయారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవండతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments