Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:59 IST)
కాకినాడలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్ (కుడా) ప్రమాణ స్వీకారోత్సవంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వేదికపై కూర్చొన్న కూటమి నేతలంతా కిందపడిపోయారు. వీరిలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. 
 
కుడా చైర్మన్‌గా తుమ్మల బాబును ప్రభుత్వం నియమించింది. దీంతో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప, జనసేన పార్టీ నేతలు పంతం నానాజీ, హరిప్రసాద్‌ తదితరులు ఆశీనులయ్యారు. 
 
అయితే, వేదికపైకి ఎక్కువ మంది రావండతో వేదిక ఒక్కసారిగా కుప్పుకూలింది. యనమల తదితరులు కిందపడిపోయారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవండతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments