Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం కిక్కులోనే పరీక్షా హాలుకుకు వచ్చిన ఇన్విజిలేటర్

Webdunia
బుధవారం, 25 మే 2022 (13:56 IST)
తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఆ ఇన్విజిలేటర్‌కు బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 30 ఉండాల్సిన స్థాయి ఏకంగా 112గా చూపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారులు ఆ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సస్పెండ్‌కు గురైన ఇన్విజిలేటర్ పేరు రవికుమార్. హుజురాబాద్‌లోని రాంపూరులో గల జడ్పీహైస్కూలులో పీఈటీ మాస్టరుగా పని చేస్తున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారి జనార్థన్ రావు మాట్లాడుతూ, విధుల్లో నిర్లక్ష్యం వహించే ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అతనితో పాటు సెంటర్ సూపరింటెండెంట్‌ని నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల నుంచి తొలగించడం జరిగిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments