Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసన్నపేటలో ఎర్రన్నాయుడి చిల్డ్రన్స్ పార్క్ కూల్చివేత

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం కూల్చివేతలపర్వం కొనసాగిస్తుంది. అమరావతి గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసింది. ఆ తర్వాత విపక్ష నేతలకు చెందిన భవనాలు, మీడియా సంస్థల భవాలను కూల్చివేస్తూ వస్తుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎర్రన్నాయుడి పేరుతో నిర్మించిన చిన్నపిల్లల పార్కును కూల్చివేసింది.
 
గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకుని ఈ చిల్డ్రన్స్ పార్కును నిర్మించారు. పైగా, ఈ పార్కు నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు కూడా మంజూరుచేసింది. అయినప్పటికి నిర్ధాక్షిణ్యంగా ఈ పార్కును అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ఈ కూల్చివేతలను టీడీపీ నేతలు, శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీలను సీజ్ చేశారు. 
 
పార్కు ప్రహరీ గోడ, రీడింగ్ రూమ్, కార్యాలయ గదులతో పాటు అంతర్గతంగా వేసిన రోడ్లను సైతం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, మరికొందరు కార్యకర్తలు అక్కడకు చేరుకుని పార్కు కూల్చివేత పనులను అడ్డుకున్నారు. దీంతో కూల్చివేత కోసం వచ్చిన కొందరు వ్యక్తులు టీడీపీ నేతలతో దాడికి పాల్పడ్డాడు. రమణమూర్తి ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్నారు. కూల్చివేతల కోసం ఉపయోగించినచ జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, ఈ పార్కు నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా అప్పటి కలెక్టర్ అనుమతులు కూడా మంజూరుచేశారు. ఈ నిధుల్లో రూ.34.50 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. అయితే, ఈ స్థలం తమదేనంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణం పనులు ఆగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments