Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లాలో దారుణం: బతికుండగానే చిన్నారిని పూడ్చి పెట్టిన తల్లి

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:24 IST)
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. బతికుండగానే ఆమె తల్లి చిన్నారిని పూడ్చి పెట్టించింది. నందిగాం మండలానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చటంతో గురువారం కాశీబుగ్గలో ఓ వైద్యుడి వద్దకు వచ్చింది. ఆమెకు ప్రస్తుతం ఏడో నెల. ఏమైందో తెలియదు గానీ.. ఆమె కోరడంతో వైద్యుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు.
 
ఆ తల్లి తనకు ఆడపిల్ల పుట్టిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తికి ఆ బిడ్డను తెల్లని వస్త్రంలో చుట్టి తీసుకెళ్లి ఖననం చేయమంది. తీసుకెళ్లిన ఆ వ్యక్తి బిడ్డను ఖననం చేసే ముందు ఫొటోలు, వీడియో తీయగా అవి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది. 
 
ఆ బిడ్డను బతికుండగానే పాతిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ శంకరరావును అడగ్గా.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. శిశువు తల్లి కాశీబుగ్గలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments