Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బ్రదర్‌కు తప్పిన ముప్పు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (14:00 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో చెట్టుకొనను తగలడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఆయనతో పాటు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి 7.30 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం... గంట ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత ఈ విమానం 8.50 నిమిషాలకు బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన 10 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ను పైలట్లు కోరారు. 
 
ఏటీసీ అనుమతితో ఆ విమానం అత్యంవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఏర్పడిన సాంకేతక లోపం ఈ పరిస్థితి తలెత్తింది. విమానంలో కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డితో పాటు పలువురు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపైనే నిలబడిపోయింది. స్పైస్ జెట్ సిబ్బంది ట్రాక్టర్ సాయంతో ఈ విమానాన్ని పాత టెర్మినల్ బిల్డింగ్ వద్దకు తీసుకొచ్చారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఇంజనీర్లు, టెక్నీషియన్లు సరిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments