Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బ్రదర్‌కు తప్పిన ముప్పు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (14:00 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ సమయంలో చెట్టుకొనను తగలడంతో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఆయనతో పాటు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి 7.30 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం... గంట ఆలస్యంగా వచ్చింది. ఆ తర్వాత ఈ విమానం 8.50 నిమిషాలకు బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన 10 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)ను పైలట్లు కోరారు. 
 
ఏటీసీ అనుమతితో ఆ విమానం అత్యంవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఏర్పడిన సాంకేతక లోపం ఈ పరిస్థితి తలెత్తింది. విమానంలో కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డితో పాటు పలువురు ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేపైనే నిలబడిపోయింది. స్పైస్ జెట్ సిబ్బంది ట్రాక్టర్ సాయంతో ఈ విమానాన్ని పాత టెర్మినల్ బిల్డింగ్ వద్దకు తీసుకొచ్చారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని ఇంజనీర్లు, టెక్నీషియన్లు సరిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments