Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డపై చర్యలకు ఏపీ స్పీకర్ చర్యలు... ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు...

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైకాపా మంత్రులు కత్తికట్టారు. ఆయన్ను ఏదో విధంగా చిక్కుల్లో పడేలా కుయుక్తులు పన్నుతున్నారు. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇచ్చారు.
 
ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని తమ నోటీసుల్లో వారు పేర్కొన్నారు. నిమ్మగడ్డ ఆయన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ఈ నోటీసులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఎస్ఈసీపై చర్యలకు ఉపక్రమించారు. ఈ నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దీంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. తమ్మినేని చర్యతో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
మరోవైపు, ఎస్ఈసీపై చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందా? అనే చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ ఆ అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉన్నట్టయితే... నిమ్మగడ్డపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments