Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజలకు చల్లని కబురు..3 రోజులు ముందుగానే..

Webdunia
బుధవారం, 29 మే 2019 (18:25 IST)
వేసవి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే దక్షిణాదిని తాకనున్నాయన్నది ఆ కబురు. ఈ ప్రభావంతో ఈసారి త్వరగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. జూన్ 6వ తేదీ నాటికి రుతుపవనాలు రానున్నాయని భావించినప్పటికీ అది కాస్తా ఇప్పుడు మరో మూడు రోజుల ముందుగానే, అంటే జూన్ 3వ తేదీ నాటికి రుతుపవనాలు దక్షిణాదిని పలకరిస్తాయని వాతావరణ శాఖ అంటోంది.
 
ముందస్తుగా రానున్న నైరుతి రుతుపవనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి. ఊహించిన దానికంటే నైరుతి రుతుపవనాలు ఈసారి అండమాన్‌ను తాకాయి. ప్రతి యేడాది మే 20వ తేదీ నాటికి అండమాన్‌ను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి మే 18 నాటికే వచ్చాయి. ప్రస్తుతం రుతుపవనాలు తమిళనాడు, దక్షిణ సరిహద్దు కర్ణాటక నుంచి కొమెరిన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. 
 
రెండు రోజుల్లో కేరళతో పాటు కర్నాటక దక్షిణ సరిహద్దుల్లో భారీ నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకనున్నాయని భావించినా మరో మూడు రోజులు ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments