Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడను ముంచెత్తిన వరదు.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం.. రైళ్లు రద్దు

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (17:07 IST)
విజయవాడ నగరం నీట మునిగింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదితో పాటు బుడమేర కరకట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు జనావాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు జనదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షాలు, వరద నీరు బీభత్సం సృష్టించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇది రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ పరిధిలో కూడా పలు రైళ్ళను రద్దు చేసింది. 
 
ముఖ్యంగా తిరుపతి మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లు తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను ఐదున్నర గంటల ఆలస్యంగా నడుపుతున్నారు. విశాఖ - నాందేడ్, నాందేడ్ - విశాఖ రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై - ఖత్రా ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments