Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడను ముంచెత్తిన వరదు.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం.. రైళ్లు రద్దు

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (17:07 IST)
విజయవాడ నగరం నీట మునిగింది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదితో పాటు బుడమేర కరకట్టలకు గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు జనావాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఫలితంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు జనదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షాలు, వరద నీరు బీభత్సం సృష్టించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇది రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ పరిధిలో కూడా పలు రైళ్ళను రద్దు చేసింది. 
 
ముఖ్యంగా తిరుపతి మీదుగా వెళ్లాల్సిన అనేక రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లు తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్, శబరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను ఐదున్నర గంటల ఆలస్యంగా నడుపుతున్నారు. విశాఖ - నాందేడ్, నాందేడ్ - విశాఖ రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై - ఖత్రా ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments