Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో గూడూరు-విజయవాడ-గూడూరు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (20:52 IST)
దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు వీలుగా, గూడూరు-విజయవాడ-గూడూరు మధ్య నూతన ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు చేసిన సూచనకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. 
 
రైల్వేబోర్డు ఆదేశించిన మేరకు రైలు నంబరు 12743 గూడూరు-విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, ప్రతిరోజూ గూడూరు నుండి ఉదయం 06:10 గంటలకు బయలుదేరి, విజయవాడకు ఉదయం 10:40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 12744 విజయవాడ-గూడూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, విజయవాడ నుండి ప్రతిరోజూ సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి, గూడూరుకు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది.

మార్గమధ్యంలో ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, మరియు తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. ఈ రైలు రెండు ఏసి చైర్ కార్, పది నాన్ ఏసి చైర్ కార్, రెండు పవర్ కార్ బోగీలతో మొత్తం పద్నాలుగు బోగీలతో నడవనున్నది. ఈ నూతన రైలుకు సంబంధించిన అధునాతన LHB బోగీలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నందున, అతి త్వరలో ఈ రైలు ప్రారంభం .

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments