Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లూరి జిల్లాలో గంజాయితో పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (08:37 IST)
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో నాలుగు కేజీల గంజాయితో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈజీ మనీ కోసం వీరు అడ్డదారులు తొక్కుతూ పోలీసులకు చిక్కారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు. ఈ నిందితుల్లో ఒకరు హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
 
అల్లూరి జిల్లాలోని సీలేరు జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారును ఆపిన పోలీసులు ఆ కారును, అందులోని యువకుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందులో నాలుగు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
జిల్లాలోని పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చినట్టు చెప్పిన ఆ ముగ్గురు యువకులు పోలీసులు గద్దించి అడగడటంతో నిజం చెప్పారు. నిందితులను దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన గండికోట లక్ష్మీసాయి, ఏపీలోని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన సీహెచ్. చంద్రశేఖర్ రెడ్డి, షేక్ కిజార్ అహ్మద్‌లుగా గుర్తించారు. 
 
వీరికి బి కన్నులు అనే వ్యక్తి గంజాయిని సరఫరా చేసినట్టు తేలింది. ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టెక్కీలు కాగా, మరొకరు బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో నిమగ్నమైవున్నాడు. వీరి నుంచి నాలుగు కేజీల గంజాయితో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments