Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యువెలరీ షాపులోకి పాము.. పట్టుకున్న ఓనర్.. కాటేసింది.. చివరికి?

Webdunia
బుధవారం, 26 మే 2021 (17:27 IST)
చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని బైరెడ్డిపల్లె మెయిన్ రోడ్డులో ఉన్న జ్యువెలరీ షాపులోకి ఓ పాము వచ్చింది. పాము యజమాని దానిని చూసి బయటకు వచ్చాడు.
 
ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆసాదుల్లా (52) దుకాణంలో ఉన్న పామును చూసి దానిని పట్టుకున్నాడు. కొద్దిసేపు దానితో చలగాటమాడాడు. పాము తలను చేతిలో పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆసాదుల్లా చేతిపై కాటు వేసింది. దీంతో అతడు పామును చంపి ఆసుపత్రికి వెళ్ళాడు. పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పలమనేరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. 
 
కాగా నిర్లక్ష్యం నిండుప్రాణం తీసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు ఆసాదుల్లాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తండ్రి మరణించడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments