Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మినా - దగ్గినా గాల్లో వ్యాపిస్తున్న కరోనా : ఆరోగ్య శాఖ

Webdunia
బుధవారం, 26 మే 2021 (16:36 IST)
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పిడుగులాంటి వార్తను ఒకటి చెప్పింది. కరోనా వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు తెలిపింది. ముఖ్యంగా, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందన్నారు. 
 
ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా కరోనా గాలి ద్వారా దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది.
 
కరోనా వైరస్‌తో కూడిన నీటి తుంపర్లను లేదా గాలి తుంపర్లను పీల్చిన వారికి వైరస్ సోకుతోందని తెలిపింది. అంతేకాదు, ఆ తుంపర్లు కళ్లలో, నోటిలో లేదా ముక్కులో పడిన వారికి కూడా వైరస్ సోకుతుందని చెప్పింది. 
 
గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని తెలిపింది. వెలుతురు, గాలి ప్రసరించని గదుల్లో ఎక్కువ మంది ఎక్కువ సేపు గడిపితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments