Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య మృతదేహానికి కడసారిగా రాఖీ కట్టిన చెల్లెలు

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (16:08 IST)
రక్షాబంధన్‌ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. రాఖీ పౌర్ణమి రోజు ఎక్కడ ఉన్నాసరే.. అన్న లేదా తమ్ముడు క్షేమంగా ఉండాలని తోబుట్టువులు రాఖీ కట్టడానికి పుట్టింటికి వస్తారు. కానీ తాజాగా అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలికి అనుకోని ఘటన ఎదురైంది. గుండె పోటుతో ఒక్కసారిగా అన్న తుదిశ్వాస విడిచాడు. అన్నయ్య మరణంతో ఆ సోదరి చివరిసారిగా మృతదేహానికి రాఖీ కట్టి అన్నాచెల్లెలి అనుబంధాన్ని గుర్తు చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం, ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య అప్పటివరకు సంతోషంగానే వున్నాడు. కానీ వున్నట్టుండి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
దీంతో చెల్లెలు గౌరమ్మ షాక్‌ అయ్యింది. అన్నయ్య ఇక లేదన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ సోదరి దుఃఖాన్ని చూసి అక్కడ వారంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అన్న క్షేమంగా వుండాలని రాఖీ కట్టడానికి వస్తే.. తనకు పుట్టెడు శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించింది.. ఆ చెల్లెలు. ఆపై కడసారిగా అన్నయ్య మృతదేహానికి రాఖీ కట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments