Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దివానోస్ పేకాట క్లబ్' పేరుతో హీరో మహేష్ బాబు చెల్లికి శిల్పా చౌదరి టోకరా

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (08:59 IST)
కిలేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలను మోసం చేసిన ఈమె కోట్లు దండుకున్నారు. ఇలాంటివారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఈమె వద్ద రూ.2 కోట్ల మేరకు శిల్పాచౌదరి టోకరా పెట్టినట్టు తెలుస్తోంది. 
 
హైదరాబాద్ నగరం, గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసం ఉంటూ వచ్చిన శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ అనే దంపతులు దివానోస్ పేరుతో ఓ పేకాట క్లబ్‌ను ప్రారంభించారు. పైగా, కోటీశ్వరులుగా తమను తాము పరిచయం చేసుకున్నవీరు టీవీ, సినీ నిర్మతలుగా నమ్మించారు. అలా అనేక మంది సినీ ప్రముఖులను కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించేవారు. 
 
ఆరంభంలో అతి తక్కువ మందితో కిట్టీపార్టీ మొదలుకాగా, ఆ తర్వాత ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్బుగా మార్చేశారు. ఇందులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దాదాపు 100 మంది వరకు సెలెబ్రిటీల కుటుంబాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, శిల్పా చౌదరి దంపతుల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments