Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దివానోస్ పేకాట క్లబ్' పేరుతో హీరో మహేష్ బాబు చెల్లికి శిల్పా చౌదరి టోకరా

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (08:59 IST)
కిలేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలను మోసం చేసిన ఈమె కోట్లు దండుకున్నారు. ఇలాంటివారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఈమె వద్ద రూ.2 కోట్ల మేరకు శిల్పాచౌదరి టోకరా పెట్టినట్టు తెలుస్తోంది. 
 
హైదరాబాద్ నగరం, గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసం ఉంటూ వచ్చిన శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ అనే దంపతులు దివానోస్ పేరుతో ఓ పేకాట క్లబ్‌ను ప్రారంభించారు. పైగా, కోటీశ్వరులుగా తమను తాము పరిచయం చేసుకున్నవీరు టీవీ, సినీ నిర్మతలుగా నమ్మించారు. అలా అనేక మంది సినీ ప్రముఖులను కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించేవారు. 
 
ఆరంభంలో అతి తక్కువ మందితో కిట్టీపార్టీ మొదలుకాగా, ఆ తర్వాత ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్బుగా మార్చేశారు. ఇందులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దాదాపు 100 మంది వరకు సెలెబ్రిటీల కుటుంబాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, శిల్పా చౌదరి దంపతుల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments