అమ్మాయిలను అదోలా చూసినా అంతే సంగతులు..

మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (12:44 IST)
మహిళలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న వేళ.. మహిళల వెంటపడి ఇబ్బంది పెట్టడమే కాదు.. కనీసం అదోలా చూపులతో ఇబ్బంది పెట్టినా జైలు తప్పదంటోంది. షీ టీమ్. ఈ క్రమంలో ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికురాలిని చూపులతో చూస్తూ.. ఇబ్బంది పెట్టిన ఓ ఆటో డ్రైవర్‌ను షీ-టీమ్‌ అరెస్టు చేసింది. ఇతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జైలు శిక్ష విధించినట్లు అదనపు సీపీ షికా గోయల్‌ తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో పనిచేస్తోంది. గత నెల 25న ఈమె తన కార్యాలయం నుంచి ఆటోలో ఇంటికి బయలుదేరింది. డ్రైవర్‌ మహ్మద్‌ మొహినుద్దీన్‌ ఆటోలో ఉన్న అద్దాన్ని తిప్పుతూ మహిళను చూడసాగాడు. 
 
ఈ వ్యవహారంపై బాధితురాలు  షీ- టీమ్స్‌కు ఫిర్యాదు చేయగా.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మొహినుద్దీన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 14 రోజుల జైలు శిక్ష విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments