Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2018 : ప్లేఆఫ్ మ్యాజిక్... 8 జట్ల మధ్య గట్టిపోటి

స్వదేశంలో గతకొన్ని రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ఇపుడు ముఖ్య ఘట్టానికి చేరుకోనున్నాయి. మొత్తం 8 జట్లు ప్లేఆఫ్ దశలోకి నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించ

Advertiesment
IPL 2018
, మంగళవారం, 8 మే 2018 (12:33 IST)
స్వదేశంలో గతకొన్ని రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ఇపుడు ముఖ్య ఘట్టానికి చేరుకోనున్నాయి. మొత్తం 8 జట్లు ప్లేఆఫ్ దశలోకి నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించనున్నాయి. ఇందులో టాప్-4 స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని జట్లూ పోటీపడుతున్నాయి. అందువల్ల మిగిలిన మ్యాచ్‌లలో గెలుపొందేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శించనున్నాయి.
 
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్క పంజాబ్, రాజస్థాన్ జట్లు మినహా మిగిలిన జట్లన్నీ పదేసి మ్యాచ్‌లను ఆడాయి. వీటిలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, కోల్‌కతా జట్లు వరుసగా టాప్-4 స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పాయింట్ల పరంగానేకాకుండా, నెట్ రన్‌రేట్ పరంగా కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
 
అయితే, ఐపీఎల్ కప్‌ను రెండుసార్లు ఎగరేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్లు, రన్‌రేట్ పరంగా కూడా రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి... మూడు మ్యాచ్‌లలో ఓడి, ఏడు మ్యాచ్‌లలో గెలుపొంది 14 పాయింట్లతో ఉంది. ఇక సన్‌రైజరస్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాలకు పంజాబ్, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో పంజాబ్, కోల్‌కతా జట్లకే అధిక అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరుకు షాకిచ్చిన సన్‌రైజర్స్ : ప్లే ఆఫ్ నుంచి కోహ్లీ సేన్ ఔట్?