Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2018 : నేడు హైదరాబాద్‌తో కోహ్లీ సేనకు అగ్నిపరీక్ష

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా సోమవారం ఆసక్తికర పోటీ జరుగనుంది. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు అగ్నిపరీక్ష ఎదురుకానుంది.

Advertiesment
IPL 2018
, సోమవారం, 7 మే 2018 (12:53 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా సోమవారం ఆసక్తికర పోటీ జరుగనుంది. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. ఎందుకంటే మంచి ఊపుమీద ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉండగా, వరుస వైఫల్యాలతో బెంగళూరు జట్టు కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
నిజానికి హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఫలితంగా 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌ గెలిస్తే రైజర్స్‌ ప్లే ఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోనుంది. కానీ, బెంగుళూరు జట్టులో కోహ్లీ, డివిల్లీర్స్‌, మెకల్లమ్‌ వంటి స్టార్లు ఉన్నా అంచనాలను అందుకోలేకపోతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో కేవలం మూడే విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. 
 
అయితే, ప్లే ఆఫ్‌లో నిలవాలంటే కోహ్లీసేన మిగిలిన అన్ని మ్యాచ్‌లూ నెగ్గాల్సిందే. దాంతో, ఒత్తిడంతా బెంగళూరుపైనే ఉండనుంది. మరి, అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రైజర్స్‌తో చావోరేవో పోరులో కోహ్లీసేన ఏం చేస్తుందో చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌ టిక్కెట్లు పదిహేను రోజుల కిందటే పూర్తిగా అమ్ముడైపోయాయి. దాంతో, స్టేడియం మొత్తం నిండిపోనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హసీన్ జహాన్.. షమీ సొంతూరికి ఎందుకెళ్లింది.. ఇంటి తాళాన్ని పగులకొట్టాలని?