Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

ఐపీఎల్ 2018 : జడేజా స్పిన్‌ మేజిక్‌.. బెంగళూరు చిత్తు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు చేతిలో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై.. సీనియర్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3

Advertiesment
ఐపీఎల్ 2018 : జడేజా స్పిన్‌ మేజిక్‌.. బెంగళూరు చిత్తు
, ఆదివారం, 6 మే 2018 (09:52 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు చేతిలో బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై.. సీనియర్‌ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/18), హర్భజన్‌ సింగ్‌ (2/22) బెంగళూరు పతనాన్ని శాసించారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో బెంగుళూరు జట్టుపై నెగ్గింది. ఈ ఓటమితో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ రేసులో ఉండాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లను నెగ్గాల్సిందే.
 
కాగా, శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. పార్థివ్‌ పటేల్‌ 41 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగులు, సౌథి 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో సాయంతో 36 (నాటౌట్‌) మాత్రమే రాణించారు. 
 
అనంతరం బరిలోకి దిగిన చెన్నై 18 ఓవర్ల లో 4 వికెట్లకు 128 పరుగులు చేసి నెగ్గింది. మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ 23 బంతుల్లో ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లతో 31 (నాటౌట్‌), సురేష్ రైనా 25 పరుగులతో రాణించారు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చిన సీఎస్కే బౌలర్ రవీంద్ర జడేజాకు "మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌" అవార్డు దక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరంతా తిరిగి నన్ను నమ్మేల నేను కృషి చేస్తా : స్టీవ్ స్మిత్