Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో మునిగిన బోటు.. 61 మంది..? వరద ఉద్ధృతి వున్నా.. పర్మిషన్లు..

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (15:05 IST)
గోదావరిలో పడవ మునిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 61 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు మునిగిపోయింది. బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది.  పోలవరం/గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్లు గోదావరిలో మునిగిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 
 
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ అనే పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటు ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments