Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుపై ఏపీ సర్కారుకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (12:50 IST)
ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ చుక్కెదురైంది. పైగా, ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కూడా అపెక్స్ కోర్టు నిరాకరించింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా, 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అందువల్ల ఈ కేసు, బెయిల్ వ్యవహారంలో చంద్రబాబుకు సైతం నోటీసులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments