Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (16:59 IST)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలు ముగిసే వరకు దానిపై మాట్లాడవద్దని కడప జిల్లా కోర్టు గత నెలలో కొంతమంది ప్రతిపక్ష నేతలను ఆదేశించింది. వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, బీటెక్ రవి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి నేతలు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడవద్దని ఆదేశించారు. 
 
కడప జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ షర్మిల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కడప కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌పై స్టే విధించింది. ప్రతివాదుల వాదనలు కూడా వినకుండానే జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
కడప కోర్టు తీర్పు వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను నిర్బంధిస్తోందని మెజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. నిందితులందరికీ నోటీసులు జారీ చేసిన మేజిస్ట్రేట్.. వేసవి సెలవులు ముగిసిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments