Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 16 నుంచి పాఠశాల ఓపెన్ : మంత్రి ప్రకటన

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:49 IST)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 16 నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు. 
 
రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని, కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించామన్నారు.
 
ఏపీలో ఆన్లైన్ తరగతులు ఎక్కడా జరగడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించామన్నారు. ఈ నెల 16 నుంచి ఆఫ్ లైన్‌లోనే పూర్తి స్థాయిలో పాఠశాలలను నిర్వహిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments