Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో దారుణం: చాక్లెట్ కోసం వంగి.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు..

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (10:28 IST)
కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బస్సు చక్రాల కింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలకు పంపడానికి నాన్నతోపాటు వెళ్లిన బాబు జీవితాన్ని బస్సు చిదిమేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోడూరుకు చెందిన శ్రీనివాసరావు, ప్రభావతి దంపతులకు ఆదిత్య, దినేష్‌కుమార్‌(3) కుమారులు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదిత్య ఎల్‌కేజీ చదువుతున్నాడు. 
 
మంగళవారం శ్రీనివాసరావు... ఆదిత్యను బస్సెక్కించేందుకు తీసుకురాగా వారి వెనుకనే దినేష్‌కుమార్‌ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో చేతిలోని చాక్లెట్‌ కిండపడటంతో దాన్ని తీసుకోవడానికి బస్సు వెనుక చక్రాల కిందకు దినేష్‌ వంగాడు. చిన్నారిని ఎవరూ గమనించలేదు. 
 
డ్రైవర్‌ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద తల నలిగి దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన శ్రీనివాసరావు స్పృహతప్పి పడిపోయారు. 
 
క్షణకాలంలో చిన్నారి మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. స్థానికంగా విషాదం నెలకొంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments