Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (16:59 IST)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలు ముగిసే వరకు దానిపై మాట్లాడవద్దని కడప జిల్లా కోర్టు గత నెలలో కొంతమంది ప్రతిపక్ష నేతలను ఆదేశించింది. వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, బీటెక్ రవి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి వంటి నేతలు ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడవద్దని ఆదేశించారు. 
 
కడప జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ షర్మిల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో షర్మిల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కడప కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్‌పై స్టే విధించింది. ప్రతివాదుల వాదనలు కూడా వినకుండానే జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
కడప కోర్టు తీర్పు వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛను నిర్బంధిస్తోందని మెజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. నిందితులందరికీ నోటీసులు జారీ చేసిన మేజిస్ట్రేట్.. వేసవి సెలవులు ముగిసిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments