నన్ను చంపేస్తానంటున్నారు కాపాడండి: వైఎస్ వివేకా కూతురు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (20:52 IST)
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనంగా మారుతోంది. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితుడిగా ఉన్న యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తు వివేకా ఇంటిలోనే ఆయన హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
 
అసలు ఈ హత్య వెనుక అసలు కారణం మాత్రం పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు సొంత చిన్నాన్న చనిపోతే ముఖ్యమంత్రి ఆ కేసును ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా వై.ఎస్. వివేకానందరెడ్డి కుమార్తె వై.ఎస్. సునీత కడప జిల్లా కలెక్టర్‌ను కలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
అంతేకాదు రాతపూర్వకంగా అసలు ఏం జరుగుతుందోనన్న విషయాన్ని స్పష్టంగా రాసిచ్చింది. నా తండ్రి హత్యపై అనేక రకాల అనుమానాలున్నాయి. ఈ కేసులో నన్ను చంపేందుకు కూడా కుట్ర జరుగుతోందని అనుమానంగా ఉంది. నా ప్రాణాలను కాపాడండి.. నన్ను రక్షించండి అంటూ కడప జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు వై.ఎస్. సునీత.
 
ఇప్పటికే వ్యక్తిగత సిబ్బందిని బాడీగార్డ్‌ను వెంట పెట్టుకుని తిరుగుతున్నారు వై.ఎస్.సునీత. ఎస్పీని కలిసిన తరువాత ఎలాంటి భద్రత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది. అయితే వివేకా హత్యకు సంబంధించి నిందితుడిని పట్టుకున్న తరువాత ఆయన కుమార్తె ఎస్పీని కలవడం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments