Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. పరువు తీయొద్దన్నా వినలేదు.. అంతే అన్నను..?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (19:35 IST)
కుటుంబ కలహాలు నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ అన్నను తమ్ముడే హత్య చేశాడు. అందుకు కారణం.. అన్న పెట్టుకున్న వివాహేతరం సంబంధం. వివరాల్లోకి వెళితే... ఏపీ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, నాగార్జున ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. 
 
అయితే అన్న అయిన వెంకట సుబ్బయ్యకు భార్య ఉంది. అయినా కానీ అతను కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో వారి గురించి ఊరంతా నీచంగా మాట్లాడుకునేవారు. 
 
విషయం తెలుసుకున్న అతని తమ్ముడు నాగార్జున తన అన్నను హెచ్చరించాడు. అలాంటి సంబంధాలు పెట్టుకుని ఇంటి పరువు తీయొద్దని అన్నాడు. అయినా వెంకట సుబ్బయ్య తన తీరు మార్చుకోలేదు. దాంతో ఒకరోజు తమ్ముడు నాగార్జున తన అన్న ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. 
 
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అతడికి ఇంటికెళ్లి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో వెంకట సుబ్బయ్యను.. నాగార్జున గట్టిగా నెట్టాడు. దాంతో అతను కింద పడిపోయాడు. 
 
తలకు తీవ్రగాయం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వెంకట సుబ్బయ్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగార్జునను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments