Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. పరువు తీయొద్దన్నా వినలేదు.. అంతే అన్నను..?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (19:35 IST)
కుటుంబ కలహాలు నేరాలకు దారితీస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ అన్నను తమ్ముడే హత్య చేశాడు. అందుకు కారణం.. అన్న పెట్టుకున్న వివాహేతరం సంబంధం. వివరాల్లోకి వెళితే... ఏపీ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, నాగార్జున ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. 
 
అయితే అన్న అయిన వెంకట సుబ్బయ్యకు భార్య ఉంది. అయినా కానీ అతను కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో వారి గురించి ఊరంతా నీచంగా మాట్లాడుకునేవారు. 
 
విషయం తెలుసుకున్న అతని తమ్ముడు నాగార్జున తన అన్నను హెచ్చరించాడు. అలాంటి సంబంధాలు పెట్టుకుని ఇంటి పరువు తీయొద్దని అన్నాడు. అయినా వెంకట సుబ్బయ్య తన తీరు మార్చుకోలేదు. దాంతో ఒకరోజు తమ్ముడు నాగార్జున తన అన్న ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. 
 
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అతడికి ఇంటికెళ్లి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో వెంకట సుబ్బయ్యను.. నాగార్జున గట్టిగా నెట్టాడు. దాంతో అతను కింద పడిపోయాడు. 
 
తలకు తీవ్రగాయం కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వెంకట సుబ్బయ్య చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగార్జునను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments