Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విహార యాత్రలో విషాదం : ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అరెస్టు

Advertiesment
Kadapa
, ఆదివారం, 8 ఆగస్టు 2021 (10:15 IST)
కడప జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. విహార యాత్రలో విషాదం జరిగింది. జిల్లాలోని పెన్నానదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఒక యువకుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
చనిపోయిన వారు కర్నాటక‌లోని రాయ్‌చూర్‌కు చెందిన వారిగా పోలీసులు చెప్పారు. కర్నాటక‌లో నివాసం ఉంటున్న ఓ ఫ్యామిలీ కడపలో ఉంటున్న వారి చుట్టాల ఇంటికి వెళ్లారు. దీంతో అందరు కలిసి పెన్నానదిని చూడడానికి వెళ్లారు. 
 
అక్కడే ఉన్న ఓ కుంటలోకి ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వాళ్లను కాపాడడానికి వెళ్లిన యువకుడు కూడా చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు