ఏపీ హైకోర్టుకు జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు సెలవులు... 12న ఆన్ లైన్!

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (09:59 IST)
ఏపీ హైకోర్టుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. హైకోర్టు క్యాలెండర్‌ ప్రకారం 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ. ఈ మూడు రోజుల్లో హైకోర్టులో ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. 16న ఆదివారం. 17వ తేదీ నుంచి హైకోర్టు తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తుంది.


ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ వెకేషన్‌ కోర్టుల్లో న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఉంటారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ మన్మధరావు ద్విసభ్య ధర్మాసనంలో, జస్టిస్‌ సురేశ్‌రెడ్డి సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. 
 
 
అత్యవసర కేసులను ఈ నెల 10న పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ పిటిషన్లపై న్యాయమూర్తులు 12న విచారణ జరుపుతారు. హెబియస్‌ కార్పస్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, మెజిస్ట్రేట్లు, సెషన్స్‌ జడ్జిలు తిరస్కరించిన బెయిల్‌ పిటిషన్లతో పాటు సెలవులు ముగిసేంత వరకు వేచిచూడలేనంత అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను మాత్రమే వెకేషన్‌ కోర్టులు విచారిస్తాయి. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments