Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌... ఉద్యమ సమర క్రాంతి సంబరాలు

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (15:11 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతిలో సంక్రాంతిని ఉద్య‌మంతో క‌ల‌గ‌లిపి చేస్తున్నారు. పండుగ సందర్భంగా ఉద్యమ సమర క్రాంతి పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో తుళ్ళూరు శిబిరం వద్ద సంబరాలను ఏర్పాటు చేశారు. 
 
 
ఆంధ్రుల సమర క్రాంతిలో భాగంగా రాజ‌ధాని రైతులు వంటా వార్పు నిర్వహించారు. ఉద్యమ గాలి పటాలు, అమరావతి ఆకుపచ్చ బెలూన్ లు గాలిలోకి ఎగుర‌వేసి సంక్రాంతి ఉద్య‌మ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు శిబిరం వద్దకు భారీగా తరలివచ్చారు.
 
 
బెలూన్లు ఎగరవేసిన రాజధాని రైతులు, సమర సంక్రాంతి పేరిట వినూత్న నిరసన తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద మహిళలు పొంగళ్లు పెట్టారు. సేవ్‌ అమరావతి - సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని బెలూన్లపై రాసి వాటిని గాల్లోకి ఎగురవేశారు. అమరావతిపై దుష్ప్రచారాలను నిరసిస్తూ గాలి పటాలు ఎగరవేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పండగలూ రోడ్డుపైనే చేసుకోవాల్సి వస్తోందని రాజధాని రైతులు వాపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments