Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్టీలకు సెలవుల్లోనూ వేతనాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

Webdunia
బుధవారం, 20 మే 2020 (08:42 IST)
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు సెలవురోజుల్లోనూ వేతనాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు.

గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వేతనాలను చెల్లిస్తున్నామని పుష్ప శ్రీవాణి మంగళవారం మీడియా కు విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యాసంస్థలకు చివరి పనిదినమైన ఏప్రిల్ 23 వ తేదివరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణలోకి తీసుకోవడం జరిగేదని చెప్పారు. ఈ కారణంగా ఏప్రిల్ 23 నుంచి మళ్లీ విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యే జూన్ 12 దాకా వారికి వేతనాలను ఇచ్చేవారు కాదని తెలిపారు.

అయితే తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలంటూ సీఆర్టీలు చేసిన విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇక నుంచి సీఆర్టీలకు వారి సర్వీసు నిబంధనల ప్రకారంగా పది రోజులు మినహాయించి మిగిలిన మొత్తం కాలానికి వేతనాలను చెల్లించనున్నామని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని పుష్ప శ్రీవాణి వివరించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments